ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలి
ABN , First Publish Date - 2022-06-30T06:00:34+05:30 IST
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలి
షాద్నగర్ అర్బన్, జూన్ 29: ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బుధవారం షాద్నగర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పుట్నాల సాయికుమార్, భానుప్రసాద్, సందీప్, సురేష్, రాకేష్, బన్నీ, జగదీశ్, అభిషేక్, సిధ్దు, శశీ, వంశీ తదితరులు పాల్గొన్నారు.