ఏపీ, తెలంగాణలో ఆన్‌లైన్ రచ్చ

ABN , First Publish Date - 2020-07-06T00:44:16+05:30 IST

త కొన్ని రోజులుగా జీవన్మరణం పోరాటం నడుస్తోంది. కరోనా బారిన నుంచి బతి బట్టకట్టకలుగుతామో....

ఏపీ, తెలంగాణలో ఆన్‌లైన్ రచ్చ

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా జీవన్మరణం పోరాటం నడుస్తోంది. కరోనా బారిన నుంచి బతికి బట్టకట్టకలుగుతామో లేదో అన్న భయాలు నెలకొన్నాయి. అయినప్పటికీ ఎవరి జాగ్రత్తలు వారు పాటిస్తూ మహమ్మారిని అంతమొందిచాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా విషయాల్లాగానే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే అంశం కూడా పెండింగ్‌లో ఉంది. 


అయితే కనికరం చూపాల్సిన సమయంలోనూ కాసుల వేట ఆపని కొన్ని యాజమాన్యాల పని తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. యూనివర్సిటీలు పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలా అని సందిగ్ధంలో ఉన్నాయి. అయినప్పటికీ విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులను వసూళ్లు చేస్తూనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో కొన్ని కాలేజీలయితే ఎగ్జామ్ ఫీజు కట్టాలి అంటే కాలేజీ ఫీజు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టు కూడా ఉన్నత విద్యా మండలిని యూనివర్సిటీలను పరీక్షలు ఎప్పుడు పెడతారో జులై 9 వరకూ తెలపాలని ఆదేశించడం జరిగింది. 


Updated Date - 2020-07-06T00:44:16+05:30 IST