ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2021-01-16T05:45:28+05:30 IST

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్‌ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.

ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి సరుకుల పంపిణీ
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

 కలెక్టర్‌ చక్రధర్‌బాబు


నెల్లూరు(హరనాథపురం), జనవరి 15 : ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్‌ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం కలెక్టర్‌ బంగ్లాలో  అధికారులతో సమీక్షించారు. ఇంటింటికి సరకులు తీసుకెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్‌ అనుసంధానం చేయాలన్నారు. వాహన రిజిస్ట్రేషన్‌సహా ఇన్సూరెన్స్‌ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జిల్లాకు ఇంకా రావాల్సిన 193 వాహనాలను త్వరగా తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 20లోగా అవసరమైన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో జేసీ హరేందిర ప్రసాద్‌, డీఎస్వో బాలకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T05:45:28+05:30 IST