ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి
ABN , First Publish Date - 2020-07-15T09:43:16+05:30 IST
గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడితే ఆర్థిక పరిస్థితి పుంజుకుం టుందని ..
ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి
ముగిసిన ‘ఎఫ్డీపీ’
ఎచ్చెర్ల, జూలై 14: గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడితే ఆర్థిక పరిస్థితి పుంజుకుం టుందని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) ఛాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా గత 21 రోజులుగా డిజిటల్ వేదికగా నిర్వహిస్తున్న అధ్యాపక అభివృద్ధికారక కార్యక్రమం (ఎఫ్డీపీ) మంగళవారం ముగి సింది. మూడు విడతలుగా ఈ కార్యక్రమం జరిగింది. పలు వురు శాస్త్రవేత్తలు, సామాజిక అధ్యయనకారులు, విద్యారంగ నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వివిధ వర్సిటీల వీసీలు ప్రత్యేక ప్రసంగాలు చేశారు.
చివరిరోజు కార్యక్ర మంలో కేసీ రెడ్డి మాట్లాడుతూ, ప్రాఽథమిక, విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుం దని తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ, తరగతి బోధనలు, ప్రయో గశాల పరిశోధనలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజ ప్రగతికి దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కూన రాంజీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.రఘు బాబు, తదితరులు పాల్గొన్నారు.