ఎఫ్డీఐల దూకుడు
ABN , First Publish Date - 2020-05-29T06:14:37+05:30 IST
దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 2019-20లో 13 శాతం పెరిగి 4,997 కోట్ల డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది 4,436 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు...
న్యూఢిల్లీ: దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 2019-20లో 13 శాతం పెరిగి 4,997 కోట్ల డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది 4,436 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. గరిష్ఠంగా ఎఫ్డీఐలు వచ్చిన రంగాల్లో సేవల రంగం (785 కోట్ల డాలర్లు), కంప్యూటర్ సాఫ్ట్వేర్/హార్డ్వేర్ (767 కోట్ల డాలర్లు), టెలీ కమ్యూనికేషన్లు (444 కోట్ల డాలర్లు), ట్రేడింగ్ (457 కోట్ల డాలర్లు), ఆటోమొబైల్ (282 కో ట్ల డాలర్లు), నిర్మాణం (200 కోట్ల డాలర్లు) ఉన్నాయి
జీడీపీ @ మైనస్ 5 శాతం: ఎస్ అండ్ పీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్ 5 శాతానికి పడిపోతుందని ఎస్ అండ్ పీ రేటింగ్ సంస్థ అంచనా వేసింది. ఇదే సంస్థ ఈ ఏడాది ఏప్రిల్లో విడుదల చేసిన నివేదికలోవృద్ధి రేటు 1.8 శాతం ఉంటుందని అంచనా వేసింది. అయితే కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడం, రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వృద్ధి మైనస్ 5శాతానికి పడిపోతుందని తెలిపింది.