ఎఫ్‌డీఐల దూకుడు

ABN , First Publish Date - 2020-05-29T06:14:37+05:30 IST

దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 2019-20లో 13 శాతం పెరిగి 4,997 కోట్ల డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది 4,436 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు...

ఎఫ్‌డీఐల దూకుడు

న్యూఢిల్లీ: దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 2019-20లో 13 శాతం పెరిగి 4,997 కోట్ల డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది 4,436 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. గరిష్ఠంగా ఎఫ్‌డీఐలు వచ్చిన రంగాల్లో సేవల రంగం (785 కోట్ల డాలర్లు), కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌/హార్డ్‌వేర్‌ (767 కోట్ల డాలర్లు), టెలీ కమ్యూనికేషన్లు (444 కోట్ల డాలర్లు), ట్రేడింగ్‌ (457 కోట్ల డాలర్లు),  ఆటోమొబైల్‌ (282 కో ట్ల డాలర్లు), నిర్మాణం (200 కోట్ల డాలర్లు) ఉన్నాయి


జీడీపీ @ మైనస్‌ 5 శాతం: ఎస్‌ అండ్‌ పీ  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 5 శాతానికి పడిపోతుందని ఎస్‌ అండ్‌ పీ రేటింగ్‌ సంస్థ అంచనా వేసింది. ఇదే సంస్థ ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన నివేదికలోవృద్ధి రేటు 1.8 శాతం ఉంటుందని అంచనా వేసింది. అయితే కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడం, రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వృద్ధి మైనస్‌ 5శాతానికి పడిపోతుందని తెలిపింది.


Updated Date - 2020-05-29T06:14:37+05:30 IST