ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ కోసం లక్ష మాస్కులు

ABN , First Publish Date - 2021-06-22T06:37:22+05:30 IST

జిల్లాలో కొవిడ్‌-19పై యుద్ధం చేస్తోన్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ కోసం లక్ష మాస్కులను హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్‌ ఎఫ్‌సీఎన్‌ ఇంపెక్స్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీ సంస్థ అందదజేసింది.

ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ కోసం లక్ష మాస్కులు
కలెక్టర్‌కు మాస్కులు అందజేస్తోన్న సంస్థ ప్రతినిధులు

గుంటూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌-19పై యుద్ధం చేస్తోన్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ కోసం లక్ష మాస్కులను హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్‌ ఎఫ్‌సీఎన్‌ ఇంపెక్స్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీ సంస్థ అందదజేసింది. సోమవారం ఆ సంస్థ ప్రతినిధులు కలెక్టరేట్‌కి వచ్చి కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌కి మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారిని కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌ ఏవీ పటేల్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ వి.గోపీకృష్ణ పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-06-22T06:37:22+05:30 IST