తండ్రీ కొడుకుల ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2021-02-26T05:30:00+05:30 IST
తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో కొడుకు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
గజపతినగరం, ఫిబ్రవరి 26: తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో కొడుకు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మరుపల్లి గ్రామానికి చెందిన గెద్ద తౌడురాజు నిత్యం మందు తాగుతూ తల్లిదండ్రు లను మానసికంగా వేధిస్తుండేవాడు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి రావడంతో తండ్రి రామునాయుడు మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో తౌడురాజు తీవ్రంగా గాయపడగా తండ్రి రామునాయుడుకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్థుల సమాచారం మేర కు తండ్రి, కొడుకును జిల్లా కేంద్ర ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. అందిన సమాచారం మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.