14 ఏళ్ల కూతురికి 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి.. డబ్బు కోసం ఆశపడ్డ ఓ తండ్రి నిర్వాకమిదీ.. 9 నెలల తర్వాత..

ABN , First Publish Date - 2022-09-16T23:06:22+05:30 IST

డబ్బుకు ఆశపడి కన్నకూతురినే అమ్ముకున్నాడు.. 14 ఏళ్ల కుమార్తెకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించాడు.

14 ఏళ్ల కూతురికి 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి.. డబ్బు కోసం ఆశపడ్డ ఓ తండ్రి నిర్వాకమిదీ.. 9 నెలల తర్వాత..

డబ్బుకు ఆశపడి కన్నకూతురినే అమ్ముకున్నాడు.. 14 ఏళ్ల కుమార్తెకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించాడు.. ఆ వ్యక్తి ఏడాది పాటు బాలికకు నరకం చూపించాడు.. బాలిక బాధను పట్టుంచుకోకుండా 9 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు.. ఆ బాలిక ఎన్నో సార్లు తప్పించుకుందామని ప్రయత్నించినా లాభం లేకపోయింది.. చివరకు ఓ వ్యక్తి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక తండ్రి, భర్త గురించి గాలిస్తున్నారు.. రాజస్థాన్‌ (Rajasthan)లోని జైపూర్ జవహర్ సర్కిల్‌లో ఈ ఘటన జరిగింది.


ఇది కూడా చదవండి..

చదివింది ఎం.కామ్.. 13 ఏళ్ల క్రితమే ప్రభుత్వోద్యోగం.. తండ్రి ఎంత చెప్పినా జాబ్‌లో చేరలేదు.. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటంటే..


బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో జవహర్ సర్కిల్ వద్ద పడి ఉన్న మైనర్ బాలిక గురించి పోలీసులకు సమాచారం అందింది. విచారణలో ఆ బాలిక షాకింగ్ విషయాలు చెప్పింది. భర్త బారి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చానని చెప్పింది. ఆ బాలిక ధోల్‌పూర్ నివాసి. ఆమె వయస్సు 14 సంవత్సరాలు. తల్లి చనిపోవడంతో ఆ బాలికను తండ్రి వేధించడం మొదలుపెట్టాడు. కూతురిని భారంగా భావించాడు. చివరకు రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆ బాలికను 40 ఏళ్ల వ్యక్తికి అమ్మేశాడు. ఆ బాలికను కొనుక్కున్న వ్యక్తి గతేడాది డిసెంబర్‌లో బలవంతంగా వివాహం చేసుకున్నాడు. 


అనంతరం ఇంటికి తీసుకెళ్లి ఆ బాలిక చేత పనులన్నీ చేయించేవాడు. ప్రతిరోజూ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. నొప్పితో ఆ బాలిక విలవిలలాడుతున్నా వదలేవాడు కాదు. ప్రతిఘటిస్తే దారుణంగా కొట్టేవాడు. ఆ బాలిక ఎన్నో సార్లు తప్పించుకుందామని ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆత్మహత్య చేసుకోవాలని కూడా చాలాసార్లు ప్రయత్నించి విఫలమైంది. చివరకు ఇల్లు వదిలి పారిపోయి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతన్నారు. 

Updated Date - 2022-09-16T23:06:22+05:30 IST