దారుణం.. తండ్రిని చంపి పాతిపెట్టిన కొడుకు
ABN , First Publish Date - 2020-09-28T00:26:48+05:30 IST
చేవెళ్ల మండలం గుండాలలో దారుణం జరిగింది. తండ్రి కిష్టయ్యను చంపి కొడుకు పొలంలో..
రంగారెడ్డి: చేవెళ్ల మండలం గుండాలలో దారుణం జరిగింది. తండ్రి కిష్టయ్యను చంపి కొడుకు పొలంలో పాతిపెట్టాడు. నెలరోజులుగా తండ్రి కనిపించకపోవడంతో బంధువులు కొడుకును నిలదీశారు. దీంతో తండ్రిని చంపినట్లు కొడుకు ఒప్పుకున్నాడు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని చెప్పాడు. అయితే తన తండ్రి హత్యకు తల్లి సహకరించినట్లు పేర్కొన్నాడు.