పెళ్లి చేయలేదన్న ఆగ్రహంతో తండ్రిని హత్యచేసిన తనయుడు
ABN , First Publish Date - 2022-05-11T15:57:24+05:30 IST
కడలూరు జిల్లా పాళయంకోటలో తనకు పెళ్లి చేయడంలేదన్న ఆగ్రహంతో కన్నతండ్రిని కుమారుడు దారుణంగా హత్య చేశాడు. కీళ్పాది ప్రాంతంలో లూర్థుసామి, ముగ్గురు కుమారులతో
చెన్నై: కడలూరు జిల్లా పాళయంకోటలో తనకు పెళ్లి చేయడంలేదన్న ఆగ్రహంతో కన్నతండ్రిని కుమారుడు దారుణంగా హత్య చేశాడు. కీళ్పాది ప్రాంతంలో లూర్థుసామి, ముగ్గురు కుమారులతో నివసిస్తున్నాడు. వీరిలో చిన్నకుమారులు ఇద్దరూ బాగా చదవి ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద కుమారుడు జాన్సన్ (39) నిరక్షరాస్యుడిగా ఏ పనులకు వెళ్ళకుండా జులాయిగా తిరుగుతున్నాడు. దీనికితోడు అతడికి మద్యం అలవాటు తోడైంది. రోజు పీకల దాకా తాగి ఇంటికి వచ్చి తనకు పెళ్ళి చేయమంటూ తండ్రి లూర్థుసామిని వేధించేవాడు. సోమవారం రాత్రి తాగి ఇంటికి వచ్చిన జాన్సన్ తన పెళ్ళి విషయమై తండ్రితో గొడవపడ్డాడు. బండరాయితో లూర్థుసామిపై దాడి జరిపి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ లూర్థుసామిని చికిత్స కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సఫలించక మంగళవారం అతడు మృతి చెందాడు.