ఛీ.. ఛీ.. వీడసలు తండ్రేనా.. రాత్రంతా ఏడుస్తూ నిద్రపోనివ్వడం లేదని ఏడాదిన్నర వయసున్న కొడుకును ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-08-14T00:10:05+05:30 IST

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కాలయముడయ్యాడు.. తన సుఖం కోసం నెలన్నర చిన్నారితో కర్కశంగా ప్రవర్తించాడు.

ఛీ.. ఛీ.. వీడసలు తండ్రేనా.. రాత్రంతా ఏడుస్తూ నిద్రపోనివ్వడం లేదని ఏడాదిన్నర వయసున్న కొడుకును ఏం చేశాడంటే..

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కాలయముడయ్యాడు.. తన సుఖం కోసం నెలన్నర చిన్నారితో కర్కశంగా ప్రవర్తించాడు.. రాత్రంతా ఎడుస్తూ తనను నిద్రపోనివ్వ లేదని కొడుకును గొంతు కోసి (Father killed son ) చంపేశాడు.. అనంతరం ఇంటి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన హర్యానా (Haryana)లోని ఫరీదాబాద్‌లో జరిగింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


ఇది కూడా చదవండి..


చేతులెత్తి దండం పెట్టి.. ఏడుస్తూ ఆ 75 ఏళ్ల వృద్ధురాలు చెప్పిన మాటలు విని చలించిపోయిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..



ఫరీదాబాద్‌లో నివసిస్తున్న సుందర్ అనే వ్యక్తి ఓ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి బసెల్వా కాలనీకి చెందిన ప్రియతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ప్రియ నెలన్నర క్రితమే కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ మగ పిల్లలే పుట్టారు. రక్షా బంధన్ రోజున ప్రియ ఒక కొడుకుని తనతో పాటు పుట్టింటికి తీసుకువెళింది. మరో కొడుకు నవీస్‌ను సుందర్‌ దగ్గర ఉంచింది. శుక్రవారం రాత్రి సుందర్ నిద్రపోతుండగా నవీస్ పదేపదే ఏడవడం ప్రారంభించాడు. నిద్రలో నుంచి లేచిన సుందర్ రెండు మూడు సార్లు నవీస్‌ను జోకొట్టి పడుక్కోబెట్టాడు. 


ఎంతకీ నవీస్ ఏడుపు ఆపకపోవడంతో సుందర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తీవ్ర కోపంతో చిన్నారి గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయారు. మధ్యాహ్నం ప్రియ ఇంటికి తిరిగి వచ్చేసరికి నవీస్ రక్తపు మడుగులో శవమై కనిపించాడు. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ప్రియ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సుందర్ కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-08-14T00:10:05+05:30 IST