కన్న కూతురిని కిరాతకంగా చంపేసిన తండ్రి.. అతను అలా ఎందుకు చేశాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-02-25T21:55:12+05:30 IST

అతను వెల్డర్‌గా పని చేస్తాడు.. భార్య ఓ బట్టల కంపెనీలో ఉద్యోగం చేస్తుంటుంది.. ఇద్దరూ తమ కూతురితో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు..

కన్న కూతురిని కిరాతకంగా చంపేసిన తండ్రి.. అతను అలా ఎందుకు చేశాడో తెలిస్తే..

అతను వెల్డర్‌గా పని చేస్తాడు.. భార్య ఓ బట్టల కంపెనీలో ఉద్యోగం చేస్తుంటుంది.. ఇద్దరూ తమ కూతురితో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు.. గురువారం ఉదయం భార్య పనికి వెళ్లాక అతను తన ఏడేళ్ల కూతురి గొంతును మొబైల్ ఛార్జర్‌తో బిగించి, మొహంపై తలగడ అదిమి పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు.. అనంతరం తను ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక అప్పులు తీర్చే మార్గం కనిపించక అతను అలా ప్రవర్తించాడు. 


కర్ణాటకలోని కోలారుకు చెందిన విజయ్‌ కుమార్‌ (37) భార్యతో కలిసి బెంగళూరు నగర జిల్లా ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని బొమ్మసంద్రలో నివాసం ఉంటున్నాడు. అతను వెల్డర్‌గా పనిచేస్తుండగా, అతడి భార్య ఓ బట్టల కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కొన్ని రోజులుగా విజయ్‌ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. అప్పుల ఊబి నుంచి బయటకు రావడం ఎలాగో తెలియక విజయ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. 


తను చనిపోతే కూతురు సమీక్ష (7)కు ఇబ్బందులు ఎదురవుతాయని ఆమెను మొబైల్ ఛార్జర్‌తో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సాయంత్రం అతని భార్య డ్యూటీ నుంచి వచ్చి ఇంట్లోని దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  

Updated Date - 2022-02-25T21:55:12+05:30 IST