తనయుడి చేతిలో తండ్రి హతం

ABN , First Publish Date - 2021-04-21T06:02:09+05:30 IST

మద్యం తాగొద్దని మందలించిన తండ్రిని కుమారుడు హతమార్చాడు.

తనయుడి చేతిలో తండ్రి హతం

నూతన్‌కల్‌ ఏప్రిల్‌ 20: మద్యం తాగొద్దని మందలించిన తండ్రిని కుమారుడు హతమార్చాడు. ఈ ఘటన మండలంలోని లింగంపల్లిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రా మానికి చెందిన ఉప్పుల వెంకన్న(65) కుమారుడు మల్లయ్య మద్యానికి బానిసయ్యాడు. సోమవారం రాత్రి కూడా కొడుకు మద్యం తాగి ఇంటికి రావడంతో తండ్రి మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వెంకన్న కిందపడగా కుమారుడు కర్రతో అతని తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకన్న భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చే స్తున్నట్లు ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  


చెట్టును ఢీకొట్టిన ట్రాక్టర్‌: డ్రైవర్‌ మృతి

నేరేడుచర్ల, ఏప్రిల్‌ 20: ట్రాక్టర్‌ చెట్టును ఢీకొని డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని పెంచికల్‌దిన్న గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన సోమలబోయిన వెంకన్న(44) గ్రామ శివారులో పొలం నుంచి ట్రాక్టర్‌లో ధాన్యం లోడుతో ఇంటికి వస్తున్నాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు కిందకు పోవడంతో ట్రాక్టర్‌ పక్కన ఉన్న చెట్టుకు ఢీకొంది. తీవ్ర గాయాలైన వెంకన్నను వెంటనే 108లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వెంకన్నకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 


యువకుడి ఆత్మహత్యాయత్నం

మేళ్లచెర్వు, ఏప్రిల్‌ 20: ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేయడంతో రామాపురం పరిధిలో రెయిన్‌ సిమెంట్స్‌  పరిశ్రమ గేటు ఎదుట ఓ యువకుడు మంగళవారం ఆత్మహ త్యాయత్నం చేశాడు. రామాపురం గ్రామానికి చెందిన ఉల వలపూడి సైదులు తండ్రి కాంట్రాక్టు కింద ఉద్యోగం చేస్తూ మృతి చెందాడు. సైదులుకు ఉద్యోగం ఇస్తానని ఆ కాంట్రాక్టర్‌ హామీ ఇచ్చి ఐదు నెలల నుంచి తిప్పుకుంటున్నాడని సైదులు ఆరోపిం చారు. కాంట్రాక్టర్‌ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ సైదులు కుటుంబసభ్యులతో కలిసి కిరోసిన్‌ బాటిల్‌తో వచ్చాడు. పరిశ్రమ గేటు ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకొని సైదులును అడ్డుకున్నారు. 

Updated Date - 2021-04-21T06:02:09+05:30 IST