పనిపై సిటీకి వెళ్లిన భర్త.. అర్ధరాత్రి గదిలోకి వచ్చిన మామయ్యను చూసి ఆ కోడలికి కంగారు.. భయంగానే ఏంటని అడిగితే..

ABN , First Publish Date - 2021-11-03T14:04:57+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక మహిళపై ఆమె..

పనిపై సిటీకి వెళ్లిన భర్త.. అర్ధరాత్రి గదిలోకి వచ్చిన మామయ్యను చూసి ఆ కోడలికి కంగారు.. భయంగానే ఏంటని అడిగితే..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక మహిళపై ఆమె మామ అకృత్యానికి పాల్పడ్డాడు. రాత్రివేళ కోడలు ఒంటరిగా ఉండటాన్ని చూసిన ఆమె మామ ఆమె గదిలోకి చొరబడి ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన చంద్రవదని ప్రాంతంలో చోటుచేసుకుంది. తెల్లరగానే బాధిత మహిళ ఈ ఉదంతాన్ని తన పుట్టింటి వారికి తెలియజేసింది. దీంతో వారు బాధితురాలి ఇంటికి వచ్చి, మామను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాధితురాలు తన మామపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


మీడియాకు అందిన సమాచారం ప్రకారం శివపురి లింక్ రోడ్డు నివాసి, 26 ఏళ్ల మోనిక(మారు పేరు)కు 2018లో పెద్దల సమక్షంలో చంద్రవదనీ నివాసి రాజు(మారు పేరు)తో వివాహం జరిగింది. కొద్దిరోజుల పాటు వీరి కాపురం సవ్యంగానే సాగింది. ఆ తరువాత వీరిమధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. అయితే పరిస్థితులు చక్కబడతాయనే ఉద్దేశంతో మోనిక అత్తవారింటిలోనే ఉంటోంది. రెండు రోజుల క్రితం మోనిక భర్త రాజు ఇంటి నుంచి పనిమీద బయటకు వెళ్లాడు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. అర్థరాత్రి సమయంలో ఆమె మామ జ్ఞానేశ్వర్ కోడలు ఉంటున్న గదిలోకి వచ్చాడు. ఆ సమయంలో మామ రావడంతో కంగారు పడిన ఆమె ఎందుకు వచ్చారని అడిగింది. అయితే అతను ఆమె మాట పట్టించుకోకుండా ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే బాధితురాలు ఈ విషయాన్ని తన పుట్టింటివారికి చెప్పింది. దీంతో వారు బాధితురాలి ఇంటికి చేరుకుని, ఆమె మామపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-11-03T14:04:57+05:30 IST