కోడలిపై మామ అత్యాచారం.. ఆ విషయం భర్తకు చెప్పగా.. ఏం చేశాడంటే!

ABN , First Publish Date - 2022-04-11T08:36:30+05:30 IST

ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.. అప్పట్నుంచి ఆమెపై మామ కన్నేశాడు.. ఆమెను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ విషయాన్ని మహిళ తన భర్తకు చెప్పింది..

కోడలిపై మామ అత్యాచారం.. ఆ విషయం భర్తకు చెప్పగా.. ఏం చేశాడంటే!

ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.. అప్పట్నుంచి ఆమెపై మామ కన్నేశాడు.. ఆమెను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ విషయాన్ని మహిళ తన భర్తకు చెప్పింది.. అతను పట్టించుకోకపోగా తండ్రికే మద్దతుగా నిలిచాడు.. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. 


మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో తాజాగా ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. దామోహ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ తన సొంత మామ, భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ మహిళకు 2020లో పెళ్లి జరిగింది. పెళ్లైన నాటి నుంచి 65 ఏళ్ల మామ ఆమెపై కన్నేశాడు. తరచుగా వెకిలి చేష్టలు, అసభ్య ప్రవర్తనతో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. గత నెలలో ఆమెపై అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు. 


ఆ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. అయితే ఆ వ్యక్తి తన తండ్రికే మద్దతుగా నిలిచాడు. భార్యపై తప్పుడు ఆరోపణలు చేసి వేధించడం ప్రారంభించాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళ మామను అరెస్ట్ చేశారు. భర్త ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 

Updated Date - 2022-04-11T08:36:30+05:30 IST