అప్పన్న హుండీ ఆదాయం రూ.31.88 లక్షలు

ABN , First Publish Date - 2021-06-22T05:58:19+05:30 IST

అప్పన్నస్వామి ఆలయంలోని హుండీలను సోమవారం లెక్కించగా రూ.31.88 లక్షలు ఖజానాకు సమకూరింది.

అప్పన్న హుండీ ఆదాయం రూ.31.88 లక్షలు
హుండీలలోని నగదును లెక్కిస్తున్న దృశ్యం

సింహాచలం, జూన్‌ 21: అప్పన్నస్వామి ఆలయంలోని హుండీలను సోమవారం లెక్కించగా రూ.31.88 లక్షలు ఖజానాకు సమకూరింది. దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ పర్యవేక్షణలో బేడా మండపంలో సిబ్బంది హుండీల లెక్కింపు చేపట్టగా రూ.31,88,662 నగదుతోపాటు 41 గ్రాముల స్వర్ణం, 4.215 కిలోల రజితం ఆభరణాల రూపంలో లభించింది. అలాగే 1,200 యూఎస్‌ఏ డాలర్లు, 500 సూడాన్‌ దినార్లు, ఐదు ఇంగ్లాండ్‌ పౌండ్లు వచ్చినట్టు అధికారులు తెలిపారు. కార్యక్రవుంంలో ఏఈబోలు వై.శ్రీనివాసరావు, కేకే రాఘవకుమార్‌, తిరుమలేశ్వరరావు, ఆనందకుమార్‌, ట్రస్టీలు, ప్రత్యేక ఆహ్వానితులు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T05:58:19+05:30 IST