ఆమె మాట్లాడలేదు, వినలేదు.. ఆమెకు తండ్రి పెళ్లి ఫిక్స్ చేశాడు.. ఆ పెళ్లి ఇష్టం లేని ఆమె ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-12-18T18:19:16+05:30 IST

ఈ 18 ఏళ్ల యువతి మాట్లాడలేదు, వినలేదు.. ఆమె తండ్రి ఆమెకు ఓ సాధారణ వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేశాడు..

ఆమె మాట్లాడలేదు, వినలేదు.. ఆమెకు తండ్రి పెళ్లి ఫిక్స్ చేశాడు.. ఆ పెళ్లి ఇష్టం లేని ఆమె ఏం చేసిందంటే..

ఈ 18 ఏళ్ల యువతి మాట్లాడలేదు, వినలేదు.. ఆమె తండ్రి ఆమెకు ఓ సాధారణ వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేశాడు.. ఆ పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదు.. తన లాంటి దివ్యాంగుడినే పెళ్లి చేసుకోవాలని ఆమె కోరిక.. తండ్రికి ఎంతగా చెప్పినా వినలేదు.. దీంతో ఆమె ఇంటి నుంచి పారిపోయింది.. నెల రోజుల పాటు వివిధ నగరాల్లో తిరిగింది.. తర్వాత పోలీస్ స్టేషన్‌కు చేరి ఫిర్యాదు చేసింది.. తన వయసు 18 ఏళ్లేనని, ప్రధాని సూచించినట్టు 21 ఏళ్ల వచ్చేవరకు పెళ్లి చేసుకోనని చెప్పింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది.


ఢిల్లీకి చెందిన 18 ఏళ్ల బదిర యువతి నవంబర్ 4న ఇంటి నుంచి పరారైంది. ఢిల్లీ నుంచి నోయిడా వెళ్లిపోయింది. అక్కడ కొన్ని రోజులు ఉండి ట్రైన్ ఎక్కి నేరుగా ఇండోర్ వెళ్లింది. తన తల్లిదండ్రులు పెళ్లి ఫిక్స్ చేశారని, ఆ పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఇండోర్‌లో ఓ గుడిలో పరిచయమైన పూజారి దంపతులతో చెప్పింది. దీంతో వారు ఆ యువతి గురించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ద్వారా వివరాలు సేకరించి ఢిల్లీలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 


పోలీసులకు ఆ యువతి తన సమస్య వివరించింది. ఓ సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, బదరి యువకుడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, అతనైతేనే తను చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాడని పోలీసులుకు చెప్పింది. అలాగే ప్రధాని సూచించిన విధంగా 21 సంవత్సరాల వచ్చే పెళ్లి చేసుకోనని చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులకు పోలీసులు నచ్చ చెప్పారు. యువతి చెప్పినట్టే పెళ్లి కోసం మరో మూడు సంవత్సరాలు ఆగాలని సూచించారు. అనంతరం ఆమెను తల్లిదండ్రులతో పంపించారు. 

Updated Date - 2021-12-18T18:19:16+05:30 IST