కరోనాతో తండ్రి మృతి
ABN , First Publish Date - 2021-05-17T05:26:23+05:30 IST
రెండేళ్ళ క్రితం అనారోగ్యంతో తల్లి, ఇప్పుడు కరోనాతో తండ్రి మరణించడంతో మూడేళ్ళ కుమారుడు అనాఽథగా మారాడు.
రెండేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి మృతి
అనాథగా మూడేళ్ల కుమారుడు
గంగాధరనెల్లూరు, మే 16 : రెండేళ్ళ క్రితం అనారోగ్యంతో తల్లి, ఇప్పుడు కరోనాతో తండ్రి మరణించడంతో మూడేళ్ళ కుమారుడు అనాఽథగా మారాడు. గంగాధరనెల్లూరు మండలం బుక్కాపట్నం దళితవాడకు చెందిన కూలీ శివ(30) గ్రామానికే చెందిన సంధ్యను నాలుగేళ్లక్రితం వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు పుట్టిన కొద్ది రోజులకే అనారోగ్యంతో సంధ్య మరణించింది. కొద్ది రొజుల క్రితం శివకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ముందు తల్లి ఇప్పుడు తండ్రిని కోల్పోయి చిన్నారి సంజీవ్ (3) అనాథగా మిగిలాడు. శివ మృతదేహాన్ని చిత్తూరు నుంచి అంబులెన్సులో తీసుకురాగా బంధువులు అనాఽథగా మిగిలిన సంజీవ్ను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.