తండ్రి మరణించిన దుఃఖంతోనే పరీక్షకు ప్లస్‌వన్‌ విద్యార్థి హాజరు

ABN , First Publish Date - 2022-05-21T15:46:13+05:30 IST

తండ్రి మృతిచెందిన సమయంలో ఓ విద్యార్థి దుఃఖాన్ని భరించి ప్లస్‌ వన్‌ పరీక్షకు హాజరయ్యాడు. దిండుగల్‌ జిల్లా వడచెందూర్‌ సమీపం సవేరియార్‌పట్టిలో ట్రావెల్స్‌ సంస్థ నడుపుతున్న

తండ్రి మరణించిన దుఃఖంతోనే పరీక్షకు ప్లస్‌వన్‌ విద్యార్థి హాజరు

పెరంబూర్‌(చెన్నై): తండ్రి మృతిచెందిన సమయంలో ఓ విద్యార్థి దుఃఖాన్ని భరించి ప్లస్‌ వన్‌ పరీక్షకు హాజరయ్యాడు. దిండుగల్‌ జిల్లా వడచెందూర్‌ సమీపం సవేరియార్‌పట్టిలో ట్రావెల్స్‌ సంస్థ నడుపుతున్న రడ్సకర్‌ గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని ఇంటి ప్రాంగణంలో కుటుంబీకులు, స్థానికుల నివాళి కోసం ఉంచారు. కొద్ది రోజులుగా అతడి కుమారుడు రాబిన్‌ ప్లస్‌ వన్‌ పబ్లిక్‌ పరీక్షలు రాస్తున్నాడు. తండ్రి మృతితో శోకతప్తుడైన రాబిన్‌ శుక్రవారం జరిగిన పరీక్షకు హాజరయ్యాడు. ఆ పరీక్ష రాసిన తర్వాత తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.

Updated Date - 2022-05-21T15:46:13+05:30 IST