తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన తనయలు

ABN , First Publish Date - 2022-08-07T06:53:23+05:30 IST

రాచపట్నం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ముత్యాల వెంకటేశ్వరరావు (చిన్నా) (70) మృతి చెందారు.

తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన తనయలు
వెంకటేశ్వరరావు కుమార్తెలతోపాటు పాడె మోస్తున్న జయమంగళ

కార్యకర్త పాడెమోసిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ

కైకలూరు, ఆగస్టు 6: రాచపట్నం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ముత్యాల వెంకటేశ్వరరావు (చిన్నా) (70) శుక్రవారం రాత్రి మృతి చెందారు.  మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ శనివారం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. చిన్నాకు ఏడుగురూ కుమార్తెలే ఉండడం, మగపిల్లలు లేక పోవడంతో అతని పెద్ద కుమార్తె పి.లలిత అంతిమ సంస్కా రం నిర్వహించగా భౌతిక కాయాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళే తరుణంలో మరో కుమార్త్తెతోపాటు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పాడె మోసారు. తండ్రికి కుమార్తెలే అంతిమ సంస్కారం నిర్వహించడం పలువురుని కలచి వేసింది.  చిన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో జయమంగళ రూ.5 వేలు ఆర్థిక సాయం చేశారు. 

Updated Date - 2022-08-07T06:53:23+05:30 IST