ఒకే స్థానానికి తండ్రీకూతుళ్ల దరఖాస్తు

ABN , First Publish Date - 2021-03-04T18:17:22+05:30 IST

కోయంబత్తూర్‌ దక్షిణ నియోజకవర్గంలో డీఎంకే తరఫున

ఒకే స్థానానికి తండ్రీకూతుళ్ల దరఖాస్తు

హైదరాబాద్/ప్యారీస్‌ : కోయంబత్తూర్‌ దక్షిణ నియోజకవర్గంలో డీఎంకే తరఫున పోటీచేసేందుకు తండ్రీకూతుళ్లు దరఖాస్తు చేసుకున్నారు. కోవై ఆర్‌ఎస్‌ పురంకు చెందిన కార్తీక్‌ సెల్వరాజ్‌, ఆయన కుమార్తె కృపలు దీనిపై బుధవారం మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం తమలో ఒకరికి ఎలాగైనా సీటు కేటాయిస్తుందన్న నమ్మకంతోనే ఇద్దరం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి తప్పనిసరిగా విజయం సాధిస్తుందని వారు నమ్మకం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-03-04T18:17:22+05:30 IST