అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2022-09-27T06:55:38+05:30 IST
అమెరికాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో తానా బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెలు మరణించారు.
తానా బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ ఇంట విషాదం
ఘటనలో భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో తానా బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెలు మరణించారు. డాక్టర్ శ్రీనివాస్ హ్యూస్టన్ పట్టణంలో నివాసముంటున్నారు. ఆయన భార్య వాణి ఐటీ ఉద్యోగి. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి వైద్య విద్యను అభ్యసిస్తోంది. రెండవ అమ్మాయి 11వ తరగతిలో ఉంది. వాణి ఆదివారం తమ పెద్దమ్మాయిని కాలేజి నుంచి తీసుకువస్తున్నారు. టెక్సా్సలోని వాలర్ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న కారును మరో వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాణి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. యావత్ కుటుంబాన్ని కోల్పోయిన శ్రీనివాస్ తీవ్ర షాక్కు లోనయ్యారు. తానా ప్రముఖులు, కుటుంబ మిత్రులు, సన్నిహితులు ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ గుంటూరు మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. 1995లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికాకు వెళ్లారు. పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్ అనస్థీషియాలజి్స్టగా అమెరికాలోని హ్యూస్టన్ పట్టణంలో స్థిరపడ్డారు. 2017 నుంచి తానా బోర్డు సభ్యునిగా సేవలందిస్తున్న డాక్టర్ శ్రీనివాస్... అమరావతి రైతు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు.