ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-12-02T01:11:33+05:30 IST
పేరు పొందిన ఫ్యాషన్ డిజైనర్ శతాబ్ది మండల్
హైదరాబాద్: పేరు పొందిన ఫ్యాషన్ డిజైనర్ శతాబ్ది మండల్ (32) ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి మైహోం విహంగలోని ఫ్లాట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మండల్ ఆత్మహత్య చేసుకున్నారు. సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుంది. ఫ్లాట్ లో ఆమె గదిలో నుంచి దుర్వాసన రావడంతో సెక్యూరిటీని రూమ్మేట్స్ అప్రమత్తం చేశారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.