రైతుల సంక్షేమమే టీడీపీ ధ్యేయం

ABN , First Publish Date - 2021-01-14T06:20:47+05:30 IST

టీడీపీ ఎప్పుడూ రైతుల పక్షానే నిలబడుతుందని ఆ పార్టీ చిత్తూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు పులివర్తి నాని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమమే టీడీపీ ధ్యేయం
రైతు వ్యతిరేక జీవోలను దహనం చేస్తున్న టీడీపీ నేతలు దొరబాబు, నాని తదితరులు

 రైతు వ్యతిరేక జీవో ప్రతుల దహనం 


చిత్తూరు సిటీ, జనవరి 13: టీడీపీ ఎప్పుడూ రైతుల పక్షానే నిలబడుతుందని ఆ పార్టీ చిత్తూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు పులివర్తి నాని పేర్కొన్నారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వం విడుదల చేసిన రైతు వ్యతిరేక జీవో ప్రతులను  పార్టీ నాయకులు భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రైతుల సంక్షేమాన్నే కాంక్షిస్తుందని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో రైతుల ఆర్థిక ఎదుగుదలకు పలురకాల రాయితీలు అమలు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ చొరవ చూపలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్రి, పి.ఎ్‌స.మనోహర్‌ నాయుడు, నౌషాద్‌, శేషాద్రి నాయుడు, దుర్గా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T06:20:47+05:30 IST