సీజేఐకి పూలతో స్వాగతం పలికిన రైతులు

ABN , First Publish Date - 2021-12-26T21:42:48+05:30 IST

ఏపీ హైకోర్టుకు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు వచ్చారు. ఎన్వీ రమణకు రాజధాని రైతులు, మహిళలు ఘన స్వాగతం పలికారు.

సీజేఐకి పూలతో స్వాగతం పలికిన రైతులు

అమరావతి: ఏపీ హైకోర్టుకు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు వచ్చారు. ఎన్వీ రమణకు రాజధాని రైతులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. కారుపైన నిలబడి రైతులకు సీజేఐ అభివాదం చేశారు. జస్టిస్‌ ఎన్వీ రమణకు రైతులు పూలతో స్వాగతం పలికారు. అంతకుముందు అమరావతి నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ మరియు రాష్ట్ర బార్ కౌన్సిల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ పిఎస్. నర్సింహ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T21:42:48+05:30 IST