17వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర

ABN , First Publish Date - 2021-11-17T13:35:38+05:30 IST

రాజధాని రైతుల మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. రాజధాని అమరావతి కోసం న్యాయస్థానం టు దేవస్థానం పేరిట రాజధాని రైతుల యాత్రను చేపట్టారు

17వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర

ప్రకాశం: రాజధాని రైతుల మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. రాజధాని అమరావతి కోసం న్యాయస్థానం టు దేవస్థానం పేరిట రాజధాని రైతుల యాత్రను చేపట్టారు. ప్రకాశం జిల్లాలో పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండేపి నియోజకవర్గాలల్లో పాదయాత్ర కొనసాగింది. మహాపాదయాత్ర నేడు కందుకూరు నుండి గుడ్లూరు వరకు 16 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. రాజధాని రైతులకు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటి వరకు 191.8 కిలోమీటర్ల మేర ముందుకు సాగింది.

Updated Date - 2021-11-17T13:35:38+05:30 IST