రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపర్చుకోవాలి
ABN , First Publish Date - 2021-05-06T07:39:51+05:30 IST
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపర్చుకోవాలని ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి అన్నారు.
నిర్మల్, మే 5 (ఆంధ్రజ్యోతి) : రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపర్చుకోవాలని ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మధ్య దళారులను ఆశ్ర యించకుండా తమ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొప్పుల గంగయ్య, ఎంపీటీసీ సాయన్న, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.