రైతులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-10-29T06:30:26+05:30 IST
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అచ్చంపేట తెలుగుదేశం పా ర్టీ ఇన్చార్జి డాక్టర్ తుంగ మోపతయ్య అన్నారు
అచ్చంపేట టీడీపీ ఇన్చార్జి డాక్టర్ మోపతయ్య
చారకొండ, అక్టోబరు 28: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అచ్చంపేట తెలుగుదేశం పా ర్టీ ఇన్చార్జి డాక్టర్ తుంగ మోపతయ్య అన్నారు. బుధవారం చారకొండ శి వారులో రైతులు వేసిన పత్తి, వరి పంటలను ఆయన పరిశీలించి రైతుల తో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రైతులు వేసిన పంటలు చేతికందే దశలోనే నష్షం వాటిల్లిందని అన్నారు. వర్షాలకు ఎక్కు వ శాతం పత్తిపంటలో విత్తనాలు మొలకెత్తాయని, దీంతో పత్తి చేతికి రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చారకొండ మండలంలో పత్తి 20వేల ఎకరాలు, వరి 476 ఎకరాలు సాగు చేశారని, వర్షాలకు 6వేల ఎకరాలు పత్తి, వరి పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు తెలిపారన్నారు. నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ. 30వేల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
అనంతరం మండలంలోని జూపల్లి గ్రామానికి చెందిన గోపాల్నాయక్ 5ఎకరా లు వరిపంట నేలపాలు కావడంతో పరిశీలించారు. చారకొండ, ఉప్పునుం తల మండలాల టీడీపీ అధ్యక్షుడు సండూరి శ్రీనివాసులు, కాశన్న, రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం. తిమ్మయ్య, అచ్చంపేట పట్టణ అధ్యక్షుడు టైలర్ శ్రీనివాసులు, విజయ్, సాయి, శివ, మహేష్, కిరణ్, రైతులు సండూరి కృష్ణయ్య, సత్తయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.