ధాన్యం అధికంగా తూకం వేస్తున్నారని రైతుల రాస్తారోకో
ABN , First Publish Date - 2022-05-17T05:33:33+05:30 IST
మండలంలోని సుందరగిరి ఎక్స్ రోడ్డు వద్ద నవాబు పేట గ్రామానికి చేందిన రైతులు దాన్యాన్ని రోడ్డుపై పోసి సోమవారం రాస్తా రోకో చేశారు.
చిగురుమామిడి, మే 16: మండలంలోని సుందరగిరి ఎక్స్ రోడ్డు వద్ద నవాబు పేట గ్రామానికి చేందిన రైతులు దాన్యాన్ని రోడ్డుపై పోసి సోమవారం రాస్తా రోకో చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల సంచికి మూడు కిలోలు అధికంగా తూకం వేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాల్కు ఏడు కిలోల వరకు అధికంగా తూకం వేడయంతో తాము నష్టపోతున్నామని తెలిపారు. రైతుల గోడు పట్టించుకోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విష యం తెలుసుకున్న సింగిల్ విండో చైర్మన్ అక్కడికి వచ్చి సమస్యను పరిష్కరి స్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ 42 కిలోల చొప్పున పంపిన ట్రాక్టర్ లోడును మిల్లర్లు దించుకోవడం లేదని, తమకు రైస్ మిల్లర్లు సహకరించడం లేదన్నారు. ఇదే విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోరునా పట్టించుకోవడం లేదన్నారు.