మెదక్: నాందేడ్-అఖోల జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

ABN , First Publish Date - 2021-11-30T18:31:34+05:30 IST

మెదక్ జిల్లా: అల్లాదుర్గం మండలం, నాందేడ్-అఖోల జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.

మెదక్: నాందేడ్-అఖోల జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

మెదక్ జిల్లా: అల్లాదుర్గం మండలం, నాందేడ్-అఖోల జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. అటు వైపుగా వస్తున్న మంత్రి హరీష్ రావు తన  కాన్వాయిని ఆపి రైతులతో మాట్లాడి.. వివరాలు తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలిగించకుండా వరి దాన్యం కొనుగోలు చెయ్యాలని హరిష్ రావు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆదేశించారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించారు.

Updated Date - 2021-11-30T18:31:34+05:30 IST