రైతులకు అండగా ఉంటాం: ప్రశాంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-10-21T02:09:08+05:30 IST

ఎప్పటిలాగే ఈసారి కూడా ధాన్యం కొనుగోళ్లు చేపట్టి.. రైతులకు అండగా ఉంటామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

రైతులకు అండగా ఉంటాం: ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌: ఎప్పటిలాగే ఈసారి కూడా ధాన్యం కొనుగోళ్లు చేపట్టి.. రైతులకు అండగా ఉంటామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ధాన్యం సేకరణపై తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఇటీవలే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్లకు మార్గం సులభం చేశారని తెలిపారు. నల్గొండ జిల్లా కంటే నిజామాబాద్‌ జిల్లా సాగుపరంగా చిన్నది అయినప్పటికీ.. ధాన్యం సేకరణ, డబ్బుల చెల్లింపు విషయంలో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిందని మంత్రి వివరించారు.

Updated Date - 2021-10-21T02:09:08+05:30 IST