రైతులు యాసంగిలో వరి వేయొద్దు: నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-11-06T23:15:00+05:30 IST

రైతులు యాసంగిలో వరి వేయొద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నారు.

రైతులు యాసంగిలో వరి వేయొద్దు: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: రైతులు యాసంగిలో వరి వేయొద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నారు. సీడ్ కంపెనీలతో ఒప్పందం ఉన్నవారు.. వరి పంట వేసుకుంటే ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఎఫ్‌సీఐ బాయిల్డ్‌ రైస్‌ కొనమని స్పష్టం చేసిన తర్వాతే.. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనలేమని తెలిపిందని పేర్కొన్నారు. వర్షాకాలం పంట కొనుగోళ్లలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందుల్లేవని నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-11-06T23:15:00+05:30 IST