అండగా ఉంటామన్న జగన్ అధికారంలోకి వచ్చాక..: పద్మశ్రీ
ABN , First Publish Date - 2020-02-22T22:06:13+05:30 IST
అమరావతి: రాజధాని గ్రామాల్లో మహిళా జేఏసీ పర్యటించింది.
అమరావతి: రాజధాని గ్రామాల్లో మహిళా జేఏసీ పర్యటించింది. ఈ సందర్భంగా సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను అవమానిస్తున్నారని విమర్శించారు. అండగా ఉంటామన్న జగన్ అధికారంలోకి వచ్చాక..అక్కా చెల్లెళ్లను రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. విశాఖలో భూదందా కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఒక పార్టీ పేరు చెప్పి అమరావతిని చంపేందుకు సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని ఆచంట సునీత అన్నారు. మహిళలు ఉద్యమం చేస్తుంటే మంత్రులు మదమెక్కి మాట్లాడుతున్నారని, అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని ఆమె అన్నారు. జగన్..ఒక్క ఛాన్స్ అంటూ.. అందరి జీవితాలను తారుమారు చేశారని దుర్గాభవాని అన్నారు. ఈ నెల 26న విజయవాడలో 24 గంటల దీక్ష చేపడతామని దుర్గాభవాని పేర్కొన్నారు.