నష్ట పరిహారం చెల్లించాలని రైతుల ధర్నా

ABN , First Publish Date - 2022-01-12T22:03:10+05:30 IST

జిల్లాలోని పరకాల మండలం మల్లక్కపేట దగ్గర రాత్రి కురిసిన

నష్ట పరిహారం చెల్లించాలని రైతుల ధర్నా

హనుమకొండ: జిల్లాలోని పరకాల మండలం మల్లక్కపేట దగ్గర రాత్రి కురిసిన వర్షానికి పంటలు ధ్వంసమయ్యాయి. దీంతో తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ పురుగుల మందు డబ్బాలతో రోడ్డుపై రైతులు బైఠాయించారు. పరకాలలో తహశీల్దార్ కాళ్ళపై పడి పంటనష్టం ఇప్పించాలని రైతులు వేడుకున్నారు. లేదంటే తమకు చావే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం వడగళ్ల వాన బీభత్సం సృష్టించిని సంగతి తెలిసిందే. జనజీవనం స్తంభించి పోయింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మిర్చితోటలకు అపార నష్టం వాటిల్లింది. సాయంత్రం 6.30 గంటల నుంచి సుమారు గంటపాటు ఆత్మకూరు, పరకాల, నడికుడ, శాయంపేట, కమలాపూర్‌ మండలాల్లో వడగళ్లవాన జోరుగా కురిసింది. 

 

Updated Date - 2022-01-12T22:03:10+05:30 IST