నల్లచట్టాలు రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-10-27T06:35:48+05:30 IST
ఢిల్లీ రైతు సంఘ ఉద్యమం ప్రారంభమై 11 నెలలు పూర్తి అయిన సందర్భంగా రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఏలూరు రూరల్, అక్టోబరు 26 : ఢిల్లీ రైతు సంఘ ఉద్యమం ప్రారంభమై 11 నెలలు పూర్తి అయిన సందర్భంగా రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు నశించాలని కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రాను భర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేశారు. సీపీఎం అప్లాండ్ జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. బండి వెంకటేశ్వరరావు, డీఎన్వీడీ ప్రసాద్, హరినాధ్, ప్రకాష్, కన్నబాబు, పి. భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.