నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
ABN , First Publish Date - 2021-06-20T04:40:58+05:30 IST
నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు, రైతులు డిమాండ్ చేశారు.
నల్లజర్ల, జూన్ 19 : నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. దూబచర్లలో శనివారం రైతులు ఆందోళన చేశారు.ఈ సంధర్బంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, రైతులు కాసాని బాటయ్య, తాతిన శ్రీనివాస్ మాట్లాడుతూ ధరల స్థిరీకరణ నిధితో నిమ్మ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కొక్కిరపాటి వెంకట్రావు, చుండ్రు నాగు, పిచ్చుకుల రమణరావు, పాల్గొన్నారు.