రైతులకు ధాన్యం బకాయి వెంటనే చెల్లించాలి

ABN , First Publish Date - 2022-06-30T05:11:27+05:30 IST

రైతులకు ధాన్యం బకాయి వెంటనే చెల్లించాలని రైతు సంఘం నాయకులు మన్నె వెంకటేశ్వరరావు అన్నారు.

రైతులకు ధాన్యం బకాయి వెంటనే చెల్లించాలి
వినతిపత్రం ఇస్తున్న రైతులు

పెనుగొండ, జూన్‌ 29: రైతులకు ధాన్యం బకాయి వెంటనే చెల్లించాలని రైతు సంఘం నాయకులు మన్నె వెంకటేశ్వరరావు అన్నారు. కౌలు, చిన్న సన్నకారు రైతులకు ధాన్యం డబ్బు అందక సార్వా సాగుకు ఇబ్బంది పడుతున్నారన్నా రు. దేవ రైతు భరోసా కేంద్రం అధికారి కె.జ్యోతికి కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. దాళ్వా సాగు అప్పులు ఇంకా తీర్చలేకపోయామన్నారు. సార్వా సాగుకు కౌలు రైతులు అందరికి కౌలు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎరువులు, పురుగు మందులు సబ్సిడీపై అందజేయాలన్నారు. మన్నె ప్రసాద్‌, మన్నె సతీష్‌, గుడాల రామకృష్ణ, కట్టా నాగరాజు, ఇంజేటి పెద్దిరాజు పాల్గొన్నారు.


అన్నదాతలను ఆదుకోవాలి

వీరవాసరం: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న అన్నదాతలకు తక్షణమే ధాన్యం సొమ్ము చెల్లించి ఆదుకోవాలని ఏపీ రైతు, కౌలు రౌతు సంఘాలు డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు జుత్తిగ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో కార్యకర్తలు బుధవారం గ్రామాల్లో రైతులను కలిసి ఆందోళనకు సిద్దం కావాలని ప్రచారం చేశారు. గురువారం మండల స్థాయిలో నిర్వహించే ఆందోళనకు సిద్దం కావాలని కోరారు. ధాన్యం బకాయల సొమ్ము వెంటనే చెల్లించాలని, గ్రామం యూనిట్‌గా పంటల బీమా ఉండాలని ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వ పథకాలు అన్నీ అమలు చేయాలని, సమస్యల పరిష్కారం కోసం అధికారులను నిలదీయాలని ప్రచారం చేశారు.

Updated Date - 2022-06-30T05:11:27+05:30 IST