బీమా సొమ్ము అందించాలని రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-01-23T06:48:27+05:30 IST

: బీమా సొమ్మును వెంటనే అందించాలని స్థానిక ఆదర్శ భారతి రైతు సేవా సహకార సంఘం ఎదుట మండల రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు.

బీమా సొమ్ము అందించాలని రైతుల ఆందోళన
బ్యాంకు ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు


కణేకల్లు, జనవరి 22 : బీమా సొమ్మును వెంటనే అందించాలని స్థానిక ఆదర్శ భారతి రైతు సేవా సహకార సంఘం ఎదుట మండల రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ బ్యాంకు పరిధిలో దాదాపు 842 ఖాతాలు వుండగా, అందులో వంద మంది రైతులకు ఆన్‌లైన్‌ ఖాతాలు లేవని తెలిపారు. బ్యాంకు అధికారులు ఆన్‌లైన్‌ అకౌంట్‌ ఉంటేనే సొమ్ము వేస్తామని చెబుతున్నారన్నారు. దీంతో తమకు ఇంతవరకు బీమాసొమ్ము అందలేదని రైతలు వరలక్ష్మీ, నారాయణ రెడ్డి, జయరామిరెడ్డి, మంజురెడ్డి, ముత్తప్ప ఆందోళన వ్యక్తం చేశారు. బీమాసొమ్మును ప్రస్తుతం మాన్యువల్‌ పద్ధతిలోనే  అందజేసి న్యాయం చేయాలని కోరారు. 


Updated Date - 2021-01-23T06:48:27+05:30 IST