మాపై అక్రమ కేసుల్ని కొట్టేయండి

ABN , First Publish Date - 2020-02-25T10:14:57+05:30 IST

దుగ్గిరాల తహసీల్దారు తమపై బనాయించిన అక్రమ కేసుల్ని కొట్టివేయాలంటూ తుళ్లూరు, మంగళగిరి మండలాల రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ధనేకుల రామారావు, నూతక్కి శ్రీదేవి తదితర 24 మంది

మాపై అక్రమ కేసుల్ని కొట్టేయండి

  • హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): దుగ్గిరాల తహసీల్దారు తమపై బనాయించిన అక్రమ కేసుల్ని కొట్టివేయాలంటూ తుళ్లూరు, మంగళగిరి మండలాల రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ధనేకుల రామారావు, నూతక్కి శ్రీదేవి తదితర 24 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 19న మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలోని ప్రభుత్వ, సీఆర్‌డీఏ భూములు సర్వే చేసేందుకు వచ్చిన దుగ్గిరాల తహసీల్దారు మల్లీశ్వరి వాహనాన్ని కొందరు అడ్డుకున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ సమయంలో తహసీల్దారు అనేందుకు ఆమె వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేదని, పైగా దుగ్గిరాల తహసీల్దారుగా ఉన్న ఆమెకు ఇతర మండలాల్లో సర్వే చేసే అధికారం లేదని, అందుకు అనుమతులూ లేవని తెలిపారు. 

Updated Date - 2020-02-25T10:14:57+05:30 IST