యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

ABN , First Publish Date - 2022-01-19T05:22:30+05:30 IST

రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. మంగళవారం మండలంలోని చెన్నూరు గ్రామంలో ధర్నాకు దిగారు.

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
చెన్నూరు సమీపంలో వెంకటగిరి రహదారిపై ధర్నా నిర్వహిస్తున్న రైతులు

గూడూరు, జనవరి 18: రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు.  మంగళవారం మండలంలోని చెన్నూరు గ్రామంలో ధర్నాకు దిగారు. చెన్నూరు, సమీపగ్రామాల రైతులు వెంకటగిరి ప్రధానరహదారిపై అరగంటపాటు బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల రైతులు 1400 ఎకరాల వరకు వరిసాగు చేస్తున్నారన్నారు. ఆర్‌బీకేలో ఉన్న యూరియా సరిపోవడం లేదన్నారు. ఎకరాకు ఒక్కకట్ట ఇస్తే చాలదని, అధికారులు సరిపడా అందించాలని డిమాండ్‌ చేశారు.  సమాచారం అందుకున్న వ్యవసాయఅధికారులు అక్కడకు చేరుకుని బుధవారం నుంచి అందిస్తామని సర్దిచెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు.

Updated Date - 2022-01-19T05:22:30+05:30 IST