Bank అధికారుల నిర్వాకంతో.. రైతు అకౌంట్‌లో పడాల్సిన డబ్బు...

ABN , First Publish Date - 2022-06-25T18:14:55+05:30 IST

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో బ్యాంక్ అధికారుల నిర్వాకమొకటి వెలుగు చూసింది. బ్యాంకు అకౌంట్‌కు..

Bank అధికారుల నిర్వాకంతో.. రైతు అకౌంట్‌లో పడాల్సిన డబ్బు...

Mahaboobabad : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో బ్యాంక్ అధికారుల నిర్వాకమొకటి వెలుగు చూసింది. బ్యాంకు అకౌంట్‌కు.. ఆధార్ లింక్(Adhar Link) మారడంతో సోమయ్య అనే రైతు నుంచి వేరే అకౌంట్లోకి ధాన్యం డబ్బులు జమ అయ్యాయి. డబ్బులు ఇప్పించండంటూ సోమయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇరవై రోజులుగా బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో చివరకు బాధితుడు పోలీసు స్టేషన్‌(Police station)లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దుక్కల్ సింగ్ అకౌంట్‌లో డబ్బులు జమ అయినట్టు పోలీసుల విచారణలో తేలింది. దర్యాప్తు కొనసాగుతోంది.


Updated Date - 2022-06-25T18:14:55+05:30 IST