రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2021-04-17T06:09:53+05:30 IST
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు.
- జడ్పీ చైర్మన్
రామగిరి, ఏప్రిల్ 16: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. శుక్రవారం మండలంలోని రామయ్యపల్లి గ్రామంలో ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అన్ని రంగాల్లో అభివృ ద్ధి చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. రైతులు పండించిన పంటకు ఎలాంటి కోతలు లేకుండా ధాన్యా న్ని సేకరించే చర్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రామగిరి, ముత్తారం ఎంపీపీలు ఆరెల్లిదేవక్క కొంరయ్యగౌడ్, జక్కుల ముత్తయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, సింగిల్విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, జడ్పీటీసీ మ్యాదరవేని శారద, వైస్ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవిభాస్కర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.