రైతు వేదికలు కర్షక దేవాలయాలు : ఎమ్మెల్యే బొల్లం
ABN , First Publish Date - 2021-06-24T05:46:45+05:30 IST
రైతు వేదికలు కర్షక దేవాలయాలు అని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ అన్నారు.
కోదాడరూరల్, జూన్ 23: రైతు వేదికలు కర్షక దేవాలయాలు అని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని కాపు గల్లు, గుడిబండ, అల్వాలపురం, చిమిర్యాల, గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు, వైకుంఠధామాలు, పల్లె,ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులతో పాటు పలు అభివృద్ధి పనులను బుధవారం ప్రారం భించారు. కోదాడ నియోజకవర్గంలో మొత్తం 21రైతు వేదికలు నిర్మించగా, రెండు మండలాల్లో ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితారాధారెడ్డి, జడ్పీటీసీ క్రిష్ణకుమారి శేషు, బుర్రా సుధారాణి, ఆర్డీవో ఎల్. కిషోర్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాషబోయిన భాస్కర్, మార్కెట్ డైరెక్టర్లు కమతం వెంకటయ్య, కౌన్సిలర్లు, బత్తినేని హనుమంతురావు, సామినేని నరేష్, కోటేశ్వరరావు, సర్పంచ్లు మీసాల శోభారాణి, కాసాని శ్రీనివాస్రావు, ఎంపీటీసీలు, క్రాంతికుమార్, శంకర్శెట్టి కోటేశ్వరరావు, నంభూరి సూర్యం, నలజాల శ్రీనివాస్, ఆవుల రామారావు పాల్గొన్నారు.