కౌలు రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-07T05:30:00+05:30 IST
మండలంలోని దీబగుంట్ల గ్రామానికి చెందిన ముని దస్తగిరి(36) అనే కౌలు రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.
గోస్పాడు, మార్చి 7: మండలంలోని దీబగుంట్ల గ్రామానికి చెందిన ముని దస్తగిరి(36) అనే కౌలు రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ముని దస్తగిరి తనకు ఉన్న 4 ఎకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని 11 ఎకరాలలో వరి, 3 ఎకరాల్లో జొన్న పంటను సాగు చేశారు. అయితే సరైన దిగుబడి రాకపోవడంతో రూ.12 లక్షల వరకు అప్పు అయిందని, అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక మానసిక వ్యధతో శనివారం అర్ధరాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్రెడ్డి తెలిపారు.