కౌలు రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-13T05:45:46+05:30 IST
కౌలు రైతు ఆత్మహత్య
మల్హర్, ఏప్రిల్ 12 : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండ లంలోని మల్లారంలో చోటుచేసుకుంది. కొయ్యూర్ ఏఎస్సై సంపత్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పర్శవేన చిన్న గట్టయ్య (45) వానాకాలంలో నాలుగున్నరెకరాల భూమి కౌలు కు తీసుకొని వరి సాగు చేశాడు. పంట దిగుబడి రాలేకపోవడంతో యాసంగిలోకూడా వరిని సాగు చేశాడు. సరైన పంట దిగుబడి రాక పోవడంతో అప్పులు తీర్చేమార్గం లేక ఆదివారం పొలం వద్ద మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఇంటికి వచ్చాడు. దీంతో కుటుంబసభ్యులు మహ దేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందుతున్న క్రమంలో చిన్న గట్టయ్య సోమవా రం మృతి చెందాడు.