సిరిసిల్లలో రైతు ఆత్మహత్య సెల్పీ వీడియో కలకలం

ABN , First Publish Date - 2020-06-06T18:26:12+05:30 IST

ఆత్మహత్యకు ముందు రైతు తీసిన సెల్పీ వీడియో కలకలం రేపుతోంది. సెల్ఫీ వీడియో తీస్తూ రైతు మైపాల్‌రెడ్డి ఆత్మహత్యకు

సిరిసిల్లలో రైతు ఆత్మహత్య సెల్పీ వీడియో కలకలం

సిరిసిల్ల: ఆత్మహత్యకు ముందు రైతు తీసిన సెల్పీ వీడియో కలకలం రేపుతోంది. సెల్ఫీ వీడియో తీస్తూ రైతు మైపాల్‌రెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు నిరాకరిస్తున్నారని రైతు ఆవేదన చెందారు. పండించిన పంటను అమ్ముకునేందుకు నానా అష్టకష్టాలు పడినట్లు రైతు గోడువెళ్లబుచ్చారు. రైస్‌మిల్లర్ల ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వాపోయాడు. మంత్రి కేటీఆర్‌ స్పందించి రైతులను ఆదుకోవాలని మైపాల్‌రెడ్డి కోరారు. కోనరావుపేట మండలం శివంగాలపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated Date - 2020-06-06T18:26:12+05:30 IST