అగ్నికి రైతు ఆహుతి

ABN , First Publish Date - 2021-03-18T02:09:13+05:30 IST

జిల్లాలో విషాద సంఘటన జరిగింది. మంటల్లో

అగ్నికి రైతు ఆహుతి

వికారాబాద్: జిల్లాలో విషాద  సంఘటన జరిగింది. మంటల్లో చిక్కుకుని ఓ రైతు ఆహుతయ్యాడు. ఈ విషాదకర ఘటన పూడూరు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కంకల్ గ్రామంలో వీరన్న(37)  అనే రైతు తన పొలంలో గడ్డి తొలగించేందుకు నిప్పు పెట్టాడు. అయితే ఎండలు బాగా ఉండడంతో తన పొలం నుంచి పక్క పొలంలోకి మంటలు పాకాయి. పక్క పొలంలో ఉన్న పశువుల మేతకు మంట తగులుతుందని రైతు భయపడ్డాడు. దీంతో పశువుల మేతకు నిప్పులు అంటకుండా మంటలను ఆర్పే ప్రయత్నం రైతు చేశాడు. అయితే ఆ మంటల వేడికి రైతు పొలంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. మంటలు ఎక్కువగా వ్యాపించడంతో రైతు ఆ మంటలలోనే సజీవ దహనమయ్యాడు.

Updated Date - 2021-03-18T02:09:13+05:30 IST