ప్రారంభమైన రైతు సంఘర్షణ సభ

ABN , First Publish Date - 2022-05-07T00:42:13+05:30 IST

హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్‌ మైదానంలో రైతు సంఘర్షణ సభ ప్రారంభమైంది. సభకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు.

ప్రారంభమైన రైతు సంఘర్షణ సభ

హన్మకొండ: హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్‌ మైదానంలో రైతు సంఘర్షణ సభ ప్రారంభమైంది. సభకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. సభ ప్రధాన వేదికకు ఎదురుగా రెండు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. కాసేపట్లో రైతు సంఘర్షణ సభలో రాహుల్‌ ప్రసంగించనున్నారు. రైతుల సమస్యలపై రాహుల్‌ వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ సభాస్థలికి రాహుల్ వచ్చారు. రాహుల్‌కు కాంగ్రెస్‌ నేతలు ఘనస్వాగతం పలికారు. 


రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ప్రధాన వేదికకు ఎదురుగా మరో రెండు వేదికలు ఏర్పాటు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను  రాహుల్ పరామర్శించారు. టీఆర్ఎస్ దోపిడీకి పాల్పడుతుందని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు.

Read more