మెదక్: రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. పిడుగుపడి ఓ రైతు మృతి చెందాడు. హవేళి ఘనపూర్ మండలంలోని వాడి గ్రామంలో పొలం వద్ద పిడుగు పడి రైతు రాజయ్య మృతి చెందాడు. రైతు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.