విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2020-07-09T11:51:45+05:30 IST

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

విద్యుదాఘాతంతో రైతు మృతి

పాపన్నపేట, జూలై 8: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని కుర్తివాడ గ్రామానికి చెందిన సాతేల్లి రమేశ్‌ (35) తాను కౌలుకు తీసుకున్న పొలంలో వరినాటు వేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం మోటారు చెడిపోవడంతో మరమ్మతుల కోసం స్టార్టర్‌ డబ్బాను ముట్టుకున్నాడు. ఆ డబ్బాకు విద్యుత్‌ ప్రవాహం ఉండటంతో ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త ఎంతకీ రాకపోవడంతో పొలంలో పని చేస్తున్న అతడి భార్య వచ్చి చూసే సరికి కిందపడి ఉన్నాడు. నాటు వేసేందుకు వచ్చిన వారు రమేశ్‌ను పరిశీలించగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. 

Updated Date - 2020-07-09T11:51:45+05:30 IST